
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం రాష్ట్రంలోనే అత్యధికంగా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పలు జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ప్రజలను అల్లాడిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.



















