
రంగారెడ్డి జిల్లాలో ఆర్.ఎం. కన్వర్టర్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న హనుమాన్ లక్ష్మణ్ అనే వ్యక్తి కంపెనీకి చెందిన సుమారు రూ. 7.90 కోట్లకు పైగా డబ్బును మోసగించి తన సొంత ఖాతాలో జమ చేసుకున్నాడు. ఈ డబ్బును షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టి నష్టపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది.



















