
కామారెడ్డి పట్టణంలో రాత్రిపూట ఒంటరిగా వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి నగదు, దుబాయ్ దిర్హమ్స్, ఐఫోన్లు, స్కూటర్తో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ఒక బాల నేరస్తుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.



















