కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ ఈ కార్యక్రమంలో పాల్గొని, రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరించారు.
గాందారి హరలే గార్డెన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం. రాజేష్ చంద్ర, IPS నేతృత్వం వహించారు. ప్రజలు హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం వంటి కీలక సూచనలు చేశారు. తద్వారా అమూల్యమైన ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, 'క్షేమంగా వెళ్లి సురక్షితంగా చేరండి' అనే నినాదం అందరి జీవితాల్లో భాగం కావాలని ఆకాంక్షించారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంపుదల అనేది నిరంతర ప్రక్రియ అని, దీనికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు.











