జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో మైనర్లకు వాహనాలు ఇవ్వడంపై తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తూ రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
కొడకండ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ సదస్సుకు సర్పంచ్ దూలం మమత సతీష్ గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అనిల్ బాబు మాట్లాడుతూ, మైనర్లకు ద్విచక్ర, ఇతర వాహనాలను ఇవ్వరాదని, వారి భద్రత విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
స్థానిక ఎస్.ఐ రాజు మాట్లాడుతూ, 18 ఏళ్ల లోపు వారికి వాహనాలు ఇవ్వడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించని వారిపై కఠిన చర్యలు, జరిమానాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.










