ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణలో భాగంగా, తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి “అరైవ్ అలైవ్” (Arrive Alive) రహదారి భద్రత కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా స్వీకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కళాభారతిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ, రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు. బైక్ పై వెళ్లేటప్పుడు డ్రైవర్తో పాటు వెనుక కూర్చునే వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, పిల్లలకు కూడా హెల్మెట్ వాడకం ప్రాణ రక్షణకు కీలకమని తెలిపారు. కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ ధరించడం వల్ల ప్రమాదాల తీవ్రత తగ్గుతుందని వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
డిఫెన్స్ డ్రైవింగ్ (Defensive Driving) ప్రాముఖ్యతను వివరిస్తూ, ముందుచూపుతో, జాగ్రత్తగా వాహనం నడిపితే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని డీజీపీ పేర్కొన్నారు. “ఇంటి నుండి బయటకు వెళ్లిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా తిరిగి రావాలి” అనే సందేశంతో “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.











