తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన విద్యార్థులకు రాష్ట్ర బడ్జెట్లో కేవలం 8% మాత్రమే కేటాయించడం విద్యార్థులను అవమానించడమేనని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జిల్లా నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఇది అవమానమని వారు అన్నారు.
నూతన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు విద్యార్థులు ఎంతో కృషి చేశారని, వారి త్యాగాలను ఈ ప్రభుత్వం గుర్తించడం లేదని ఏబీవీపీ నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలపై మౌనం వహించిందని, పక్క రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపులను చూసి సిగ్గుపడాలని సూచించారు.
కేవలం 8% బడ్జెట్ కేటాయింపులు విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసేలా ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాంతాచార్య వంటి త్యాగమూర్తులకు ఇది అవమానమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా నాయకులు వెంకట్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.











