తెలంగాణ హైకోర్టు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుపై కీలక తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించిన న్యాయస్థానం, దిల్సుఖ్నగర్లోని కోణార్క్ థియేటర్కు మాత్రమే పార్కింగ్ ఫీజు రద్దు చేసింది.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సవరించింది. ఈ ఉత్తర్వులు కేవలం దిల్సుఖ్నగర్లోని కోణార్క్ థియేటర్కు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది.
సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ సుదర్శన్ 35MM, RR సినీ ఎంటర్ప్రైజేస్ తదితరులు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. తమ పిటిషన్లో ఒకే థియేటర్ ప్రతివాదిగా ఉన్నప్పటికీ, సింగిల్ జడ్జి తీర్పును అన్ని థియేటర్లకు వర్తింపజేయడం సరికాదని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, సింగిల్ జడ్జి తీర్పును పాక్షికంగా మార్పు చేసింది. దిల్సుఖ్నగర్లోని కోణార్క్ థియేటర్లో మాత్రం పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదని ఆదేశించింది. మిగిలిన థియేటర్ల విషయంలో ఈ తీర్పు వర్తించదు.
గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ప్రకారం, తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు. అయితే, ఈ తీర్పుపై అప్పీళ్లు దాఖలవడంతో హైకోర్టు ఈ తాజా నిర్ణయం తీసుకుంది.











