
తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో, 'ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా, జిల్లా స్థాయి వక్తృత్వ, వ్యాసరచన పోటీలు జూన్ 3వ తేదీన సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించబడనున్నాయి. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ వంటి అంశాలపై విద్యార్థులలో అవగాహన పెంపొందించడమే ఈ పోటీల లక్ష్యం.



















