
ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి కామారెడ్డి జిల్లాలో విశేష స్పందన లభించింది. సోమవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 97 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి వేగం పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు.



















