
కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ చర్ల మండలంలో విస్తృత పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించి, అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.



















