
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 10న హైదరాబాద్ రానున్న నేపథ్యంలో, నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి రాష్ట్ర ఉన్నతాధికారులు కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, 'బ్లూ బుక్' నిబంధనల ప్రకారం అత్యున్నత స్థాయి భద్రతా చర్యలు అమలు చేయాలని ఆదేశించారు.



















