
జనగణన-2027లో భాగంగా చేపడుతున్న ఇంటి గణన, ఇంటి జాబితా తయారీ కార్యక్రమంపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు కీలక సూచనలు చేశారు. గురువారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో, ఇంటిగణన ప్రక్రియను పటిష్టంగా నిర్వహించాలని, ఎన్యూమరేటర్లకు పూర్తి సహకారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.



















