
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో, రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటల నుంచి తొలి ట్రెండ్స్ వెలువడే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.



















