
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన ఇన్స్టాగ్రామ్ ట్రాప్ కేసులో పోలీసులు కీలక వివరాలను వెలుగులోకి తెచ్చారు. ధనవంతులైన యువకులను లక్ష్యంగా చేసుకుని, సోషల్ మీడియా ద్వారా మైనర్ బాలికలను వలలో వేసుకున్న ఈ కేసులో మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చినట్లు సమాచారం. కేసుతో సంబంధం ఉన్న రిమాండ్ నివేదికలో అనేక సంచలన అంశాలు బయటపడ్డాయి.



















