
భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించిన సమయంలో, పాకిస్థాన్కు చైనా సాంకేతిక సహాయం అందించినట్లు తాజాగా చైనా మీడియా ధ్రువీకరించింది. ఈ విషయంపై చైనా బహిరంగంగా అంగీకరించడం ఇదే తొలిసారి.



















