
రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామంలో ఫ్రూట్ మార్కెట్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నిర్మాణానికి భూసేకరణకు వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ భూములను లాక్కుంటున్నారని ఆరోపిస్తూ, మండుటెండలో జేసీబీలకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో అధికారులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.



















