
సమాజాన్ని శాస్త్రీయ దృక్పథంతో అర్థం చేసుకుని, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాలని, అందుకు విద్యార్థులే మార్గదర్శకులు కావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (పీడీఎస్యూ) ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో నిర్వహించిన రాజకీయ శిక్షణా తరగతుల్లో ఈ పిలుపునిచ్చారు.



















