
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడ్ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం లభ్యమైన కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ హత్య కేసులో భర్తే నిందితుడని, పథకం ప్రకారమే హత్య చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అదనపు కట్నం వేధింపులు, కుటుంబవిభేదాలు, అక్రమ సంబంధాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.



















