
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలును పటిష్టపరిచేందుకు సంబంధిత అధికారులను ఇంటింటి సర్వే నిర్వహించాలని మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించింది. అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా సౌకర్యాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాగే, జూన్ 2 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యక్రమాలపై కూడా చర్చించారు.



















