
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, తొలిసారిగా సభను ఉద్దేశించి ప్రసంగించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్, తన ప్రభుత్వం డ్రగ్స్పై నేటి నుంచే పోరాటం ప్రారంభిస్తుందని ప్రకటించారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని, రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ఆయన ఆరోపించారు.



















