
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'మత్స్యకారుల సేవలో' పథకం కింద రాష్ట్రంలోని 1,30,796 మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 20,000 చొప్పున మొత్తం రూ. 262 కోట్లను ఆర్థిక సహాయంగా అందించింది. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని డిజిటల్ పద్ధతిలో జమ చేశారు.



















