
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) హైదరాబాద్ నగరంలో పర్యావరణహిత ప్రజా రవాణాను ప్రోత్సహించే దిశగా మరో ముందడుగు వేసింది. గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా కూకట్పల్లి డిపోకు చెందిన 60 నూతన ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ చర్యతో నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలకు ఊతం లభించింది.



















