
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. రాష్ట్ర ఆవిర్భావం వెనుక అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.



















